భువనగిరి : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడంకోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్రామాలలో మంగళవారం పర్యటించి గ్రామంలోనే ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రతి వార్డులో సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి ఇంటినుంచి వచ్చిన మురుగునీరు కన్పించకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానన్నారు. తాగునీటి సమస్య తీర్చడం, శిధిలావస్థకు చేరిన విద్యుత్ స్థంబాలను తొలగించి నూతన స్థంభాలు ఏర్పాటు చేయడంతో పాటు వార్డులను సుందరీకరించేందుకు కృషి చేస్తానన్నారు.
వార్డులను కలియతిరిగి డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మాణాలకు కొలతలు తీసి అంచన వేయించారు. ఆయా కార్యక్రమాలల్లో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేష్గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామియాదవ్, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ఆయా గ్రామాల సర్పంచ్లు జీలుగు కవితాసతీష్పవన్, గంటెపాక యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు అతికం లక్ష్మినారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్రెడ్డి, కోమటిరెడ్డి మోహన్రెడ్డి, అబ్బగాని వెంకట్గౌడ్, కేశపట్నం రమేష్, సామల వెంకటేశ్, అంకర్ల మురళీకృష్ణ, యశీల్గౌడ్, జహాంగీర్, పోల ప్రవీణ్గౌడ్, పాశం మహేష్ తదితరులు పాల్గొన్నారు.