భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 2 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారిని, సంక్షేమ పథకాలు అందని గడప లేదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని బొల్లేపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారని తెలిపారు. అభివృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు. మరోసారి కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చేస్తానన్నారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోద శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో 100మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓంప్రకాశ్గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, ఎడ్ల సత్తిరెడ్డి, బల్గూరి మధుసూదన్రెడ్డి, జక్క రాఘవేందర్రెడ్డి, సందెల సుధాకర్, ర్యాకల శ్రీనివాస్, సామల వెంకటేశ్, సిలువేరు మధు, ప్రవీణ్, గోద శ్రీనివాస్, వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కట్రలకు రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని గౌస్కొండలో కాంగ్రెస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు వాకిటి జంగారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో దోసపాటి కృష్ణ, కొయ్యడ నరసింహ, బాలరాజు, లింగాల శంకర్, ఊశయ్య, పద్మయ్య, దుబ్బాక ఐలయ్య, మల్లేష్, రాజు, ప్రకాశ్రెడ్డి, భాను, శ్రీను, వెంకటేశ్, యాదయ్య ఉన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చిలువేరు బాలనరసింహ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్రెడ్డి, జిల్లా డైరెక్టర్ గోరంటి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ ఫకీరు లావణ్యాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వాకిట బాల్రెడ్డి, నాయకులు గొంగిడి వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గుర్రం బాల్రెడ్డి, నాంపల్లి రవీందర్రెడ్డి, మునుకుంట్ల దేవేందర్, పోచయ్య పాల్గొన్నారు.