మాడ్గులపల్లి, నవంబర్ 18: 50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెసోళ్లు అప్పడు ఏమి చేయలేదని, ఇప్పుడు కూడా వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని ధర్మాపురం, గోపాలపురం, మాచనపల్లి, కేశవాపురం, నారా యణపురం, గారెకుంటపాలెం, కన్నెకల్ గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అభిమానులు, కార్యకర్తలు పూల దండలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మహిళలు ఎమ్మెల్యే భగత్కు మంగళ హారతులు పట్టి తిలకం దిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ ఆశీర్వదించి .. మరోసారి గెలిపిస్తే ప్రజాసేవకుడి ఉంటానని తెలిపారు.
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ప్రజలకు చేసిందేమి లేదని ఆరోపించారు. 2018లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తరువాత నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రం లో తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ పింఛన్లను పెంచడంతో పాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు. గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి ఘనత బీఆర్ఎస్దేన న్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతి ఇంట్లో కేసీఆర్ పథకం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు.
2014లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో చేర్చిందని ఎద్దేవా చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. పోకల శ్రీవిద్య, రాజు, బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, ఏఎంసీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పగిళ్ల సైదులు, మాజీ ఎంపీపీ దాసరి నర్సింహా, జిల్లా కోఆప్షన్ మెంబర్ మోసిన్అలీ, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ పిచ్చిరెడ్డి, సర్పంచ్లు చింతరెడ్డి మహేశ్వరియాదగిరెడ్డి, జొన్నలగడ్డ విజయశ్రీని వాస్ రెడ్డి, ఉపసర్పంచ్ కొత్త శ్రీను, కన్నెబోయిన నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు బారెడ్డి రామాంజిరెడ్డి, దాసరి నాగయ్య, బందా రం సైదులు, చింతరెడ్డి లింగారెడ్డి, గోవింద్రెడ్డి, దాసరి నాగయ్య, మల్లికంటి గోపాల్, కృష్ణయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నిడమనూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని గుంటిపల్లి, జంగాల గూడెం, జూలకంటివారిగూడెం, బంటువారిగూడెం, ఎర్రగూడెం, మారపాక, గోవిందన్నగూడెం, లక్ష్మిపురం, కట్టవారిగూడెం, వెంకటాపురం, వంగాలగూడెం, నందికొండవారిగూడెం, ఊట్కూర్ గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, జెడ్పీ ఇరిగి పెద్దులుతో కలసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే భగత్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే ప్రజలు కరెంట్ కష్టాలు, అవినీతిపాలనను కొనితెచ్చుకోవడమేనని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వలో నాగార్జున సాగర్ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ది సాధించింద ని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4016 లు ఇస్తుందని గుర్తు చేశారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గు ర్తుపై ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మ న్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీపీ సలహదారుడు బొల్లం రవి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోలే డేవిడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, హాలియా మార్కెట్ వైస్ చైర్మన్ రామలింగయ్య, జీవన్రావు, దేవస్ధానకమిటీ చైర్మన్ లింగప్ప, సర్పంచ్ గుండెబోయిన రాంబాబు, నాగలక్ష్మి, రమణారెడ్డి, అలుగుబెల్లి మమతకోటిరెడ్డి, పోలేపల్లి సంధ్యరాణి సైదులు, మేరెడ్డి వెంకటరమణ, బిక్షం, పిట్టల ర మేశ్, మారకొండయ్య, జానయ్య ఉన్నారు.