హాలియా, ఫిబ్రవరి 19 : కార్యకర్తల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనుముల మండలం పంగవానికుంటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు సురభి శ్రీను, జింకల నరేశ్ ఇంటికి ఆదివారం ఎమ్మెల్యే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ బీమా కింద వారి కుటుంబాలకు మంజూరైన రూ. 2లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, ఎంపీటీసీ ఉర్లగొండ వెంకటయ్య, మార్కెట్ డైరెక్టర్లు ఉడ్తూరి శ్రీనివాస్రెడ్డి, సోశం శ్రీనివాస్గౌడ్, సురభి రాంబాబు, నాయకులు పంగ లక్ష్మణ్యాదవ్, గార్లపాటి ఎల్లయ్య, నరేశ్, ఊర అఖిల్, బుచ్చిరాములు, సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళి
హాలియాలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీని స్ఫూర్తిగా తీసుకొని నాగార్జునసాగర్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అనుముల మండలం యాచారంలోని శంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన వెంట సర్పంచ్ చెదురుబెల్లి రాములు, దేవాలయ చైర్మన్ ఇసురాజు శ్రీను, డైరెక్టర్లు, నాయకులు ఉన్నారు.
శివాలయాల్లో ఎమ్మెల్యే పూజలు
నిడమనూరు : మండలంలోని ముప్పారం, తుమ్మడం గ్రామాల్లోని శివాలయాల్లో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు గుదె లక్ష్మీనర్సయ్యశర్మ ఆయనకు ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చేకూరి హనుమంతరావు, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, కూరాకుల వెంకటేశ్వర్లు ఉన్నారు.