హాలియా, అక్టోబర్ 22 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ కోరారు. ఆదివారం మండలంలోని అన్నారం గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్కిట్, బీసీలకు ఆర్థిక సాయం, గృహలక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ఇందులో ఏ ఒక్క పథకం కూడా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల తర్వాత రైతుబంధు సాయాన్ని రూ.16 వేలకు, ఆసరా పింఛన్లు రూ.5016 పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ను రూ. 400కే అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత ఒక్క బీఆర్ఎస్ పార్టీదే అన్నారు.
ప్రస్తుతం పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేస్తారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. కనీసం ఆపదలో ఉన్న ప్రజలను కూడా పట్టించుకోలేదని.. రేపు ఆయన కొడుకు గెలిచినా ఇదే పరిస్థితి ఉంటుందని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని, వారి మాయ మాటలు వింటే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
పదేండ్లుగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే భగత్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు వెంకట్రెడ్డి, గంగుల వెంకన్న, చెదురుమల్లి రాములు, రవీందర్రెడ్డి, మాజీ సర్పంచ్ గోనే శ్రీనివాస్రావు, ఉప సర్పంచ్ లచ్చయ్య, మార్కెట్ డైరెక్టర్ పోశం శ్రీనివాస్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, రాయనబోయిన రామలింగయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, నాయకులు గోదాల హనుమంతరెడ్డి, నిమ్మల భాస్కర్, బొమ్మపాల లింగయ్య, సత్తిరెడ్డి, నర్సిరెడ్డి, గోన సత్యనారాయణ, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
గుర్రంపోడు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మండలంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ఓటు అభ్యర్థించాలని సూచించారు.
ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక గుర్రంపోడు మండలంలో రూ.70 లక్షల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ, పార్టీ మండలాధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్రావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దోటి చంద్రమౌళి, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.