నిడమనూరు, నవంబర్ 1: దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం నర్సింహ్మయ్య మూడో వర్ధంతి సందర్భంగా వేంపాడు స్టేజీ వద్ద నోముల నర్సింహ్మయ్య విగ్రహానికి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా క్షేమమే లక్ష్యంగా నిరంతరం శ్రమించిన నర్సింహ్మయ్య ఆదర్శప్రాయుడన్నారు.
నివాళులర్పించిన వారిలో నర్సింహ్మయ్య సతీమణి నోముల లక్ష్మి, కుటుంబ సభ్యులు సాదం సంపత్ కుమార్, నోముల ఝాన్సీ, సాయల రవి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్, మాజీ ఆప్కాబ్ చైర్మన్ విజయేందర్ రెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ, నిడమనూరు మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు తాటి సత్యపాల్, నాగయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ జానయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, నాయకులు గుం డెబోయిన కోటేష్ యాదవ్, కట్టెబోయిన గోవర్ధన్ యాదవ్, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, అల్వాల కళావతి, మాద ధనలక్ష్మి, మేరెడ్డి వెంకటరమణ, బొమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులున్నారు.
హాలియా: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే నోముల భగత్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమని తెలి పారు. 2018 ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ ఈవీఎంలు విప్పి చూసిన తరువాత రాష్ట్రంలో ప్రజలు ఏకపక్షంగా బీఆర్ఎస్కే పట్టం కట్టారని గుర్తుచేశారు. కొన్ని మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ను చూసి బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడొద్దని సూచించారు. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. మూడు మాసాలుగా బీఆర్ఎస్ గెలుపు కోసం తన వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నో ముల భగత్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.