మిర్యాలగూడ రూరల్, అక్టోబర్ 6 : గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని తుంగపహాడ్ నుంచి బాబుసాయిపేట వెళ్లే దారిలో రూ.2.కోట్లతో చేపట్టే వంతన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అంతకుక్రితం రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆగ్రో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తానేదానితండాలో రూ.20 లక్షలతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవనానికి, అజ్మీరాతండాలో రూ.30 లక్షలతో నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణానికి, బోట్యానాయక్తండా నుంచి దుబ్బతండా వరకు రూ.5.40 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి, రూ.20 లక్షలతో యాద్గార్పల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.60 లక్షలతో సీసీ రోడ్ల పనులకు, అలాగే రూ.15 లక్షలతో మైనంవారిగూడెం నుంచి తక్కెళ్లపహాడ్ వరకు నిర్మించే రోడ్డుకు, తక్కెళ్లపహాడ్ నుంచి దుబ్బతండా వరకు రూ.90లక్షలతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి, సామ్యగానితండాలో రూ.3.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, రూ.30 లక్షలతో తడకమళ్ల ఆదర్శనగర్ బ్రిడ్జీ నిర్మాణానికి, తడకమళ్ల నుంచి లింగమంతునిస్వామి గుడి వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఏడుకొండలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదులుయాదవ్, ఎంపీటీసీ సుజాత, సర్పంచులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్, అక్టోబర్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని తాళ్లగడ్డ షాబ్నగర్ ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల పిల్లలు అర్థాకలితో పాఠశాలలకు హాజరవుతున్నారని, విద్యార్థుల శారీరక ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అధిక పోషకాలతో కూడిన సీఎం అల్ఫాహార పథకం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. అల్ఫాహార పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని దాంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం వసతి గృహాల్లోనూ, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లోనూ నాణ్యత లేని దొడ్డు బియ్యంతో విద్యార్థులకు ఆహారం అందించేదని అది తినలేక విద్యార్థులు పస్తులుండేవారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. విద్యార్థుల బాధలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ వసతి గృహాల్లో, మధ్యాహ్న భోజనంలోనూ, గురుకుల పాఠశాలల్లోనూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన సన్న బియ్యంతో భోజనాలు పెడుతున్నట్లు చెప్పారు. ఆగ్రో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంఈఓ మాలోతు బాలాజీనాయక్, రైతు బంధు సమితీ మండల అధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, కౌన్సిలర్లు రమేశ్, అశోక్, పౌర సరఫరాల అధికారి నాగేశ్వర్రావు, సంజీవరెడ్డి, హెచ్చం పుల్ల సారయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 10న మిర్యాలగూడ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ స్థలాన్ని అధికారులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పరిశీలించారు. అలాగే వైకుంఠ ధామం, ప్రగతి నివేదిక సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సజావుగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటగిరి పాల్గొన్నారు.