అడవిదేవులపల్లి, అక్టోబర్ 20 : గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారుగడ్డతండా, ఉల్సాయిపాలెం, తాటిచెట్టుతండా, గాంధీనగర్, కాల్వకట్ట, బంజారాతండా, గోన్యతండా, చాంప్లాతండా, కొత్తనందికొండ, జిలకురకుంటతండా, అడవిదేవులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేయాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొదన్నారు. 60 ఏండ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమిలేదన్నారు. రూ.300 కోట్లతో దున్నపోతులగండి, చిట్యాల ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించి పనులను శరవేగంగా చేపట్టడం జరుగుతుందన్నారు. చిన్న మండలమైన అడవిదేవులపల్లికి ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని ప్రతి తండా, ప్రతి గ్రామంలోని ప్రజలతో తనకు సుదీర్ఘకాలం అనుబంధం ఉన్నదన్నారు.
రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ను అందించిన ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో జనరంజకంగా ఉన్నదని చెప్పారు. వికలాంగుల పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు, ఇతరుల పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని మ్యానిఫెస్టోలో చెప్పడం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతకుముందు మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామం బంగారుగడ్డతండాలో ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, వైస్ ఎంపీపీ కూరాకుల మల్లీశ్వరీగోపీనాథ్, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పౌలు నాగార్జున, సీనియర్ నాయకుడు ఎం.సూర్యానాయక్, ఏఎంసీ ఛైర్మన్ బైరం బుచ్చయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : మిర్యాలగూడకు చెందిన ముడుంబై రామానుజాచార్యులు తన భార్య మంగతాయారుతో కలిసి శుక్రవారం ఉదయం కారులో హైదరాబాద్కు బయల్దేరారు. ఈ క్రమంలో మండలంలోని టోల్ ప్లాజా వద్దకు రాగానే కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే భాస్కర్రావు ఆగి విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.