కికు యనమల, కశిష్ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం గ్లింప్స్ని విడుదల చేశారు.
డెక్ట్సోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి) అనే వ్యాధితో బాధపడే చిరంజీవి అనే యువకుడి ప్రేమకథ ఇదని, సర్వైవల్ థ్రిల్లర్గా మెప్పిస్తుందని, కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్చంద్ర, రచన-దర్శకత్వం: శుభసాయి వెంకట్.