తుంగతుర్తి, డిసెంబర్ 10 : ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు నగదు పెంపునకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్లు ఇచ్చి వారితో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రానున్న వంద రోజుల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు.
తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ ప్రజలకు మంచి వైద్యం అందించాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ కిరణ్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, డాక్టర్ పెండెం వెంకటరమణ, డాక్టర్ నిర్మల్కుమార్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ వీరబ్రహ్మచారి అన్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జడ్పీ సీఈఓ సురేశ్, సూపరింటెండెంట్ డాక్టర్ మురళీదర్రెడ్డితో కలిసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సాయాన్ని రూ.10 లక్షలకు పెంచిందని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.