సంస్థాన్నారాయణపురం, నవంబర్ 21: ఉప ఎన్నికల సందర్భంలో రూ.1800 కోట్ల కాంట్రక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడి కాంట్రక్టులు దక్కించుకునేందుకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాడని బీఆర్ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పుట్టపాక, కొత్తగూడెం, జనగాం, వావిళ్లపల్లి, లచ్చమ్మగూడెం గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములని, ప్రజలు పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే రాష్ర్టంలో కారు చీకట్లు అలుముకుంటాయని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్తోనే వెనుకబడ్డ తెలంగాణ రాష్టాన్ని తొమ్మిదేండ్లలోనే అభివృద్ధిలో అగ్ర గామిగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏర్పాడ్డాక 2014లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఒక కాంట్రక్టర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అభివృద్ధి కుంటుపడిందని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతో మళ్లీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉండి కూడా మునుగోడు ప్రజల కనీస అవసరలను తీర్చలేక పోయిన రాజగోపాల్రెడ్డిని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనను మరో మారు ఆశీర్వదించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్, వైస్ ఎంపీపీ రాజునాయక్, సర్పచుల ఫోరం మండలాధ్యక్షుడు దోనూరి జైపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, సర్పంచులు సామల భాస్కర్, దోనూరి సుశీల, జక్కర్తి పాపయ్య, జెన్నాయికోడె అలివేలు, ఎంపీటీసీలు దోటి జంగయ్య, గడ్డం పెంటమ్మ, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తిరుమలేశ్, బీరయ్య, వనం స్వామి, నాయకులు గడ్డం మురళిధర్రెడ్డి, శ్రీరాముల నర్సింహ, గడ్డం నరేశ్, బంటు సైదులు పాల్గొన్నారు.