చౌటుప్పల్, అక్టోబర్ 21 : సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారన్నారు.
పార్టీ మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీల్లో ఇవ్వని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసిందన్నారు. వాటిని సైతం ప్రజలకు వివరించాలన్నారు. స్థానికంగా జరిగిన అభివృద్ధిని కూడా వివరించాలన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రజలెవ్వరూ నమ్మరన్నారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి, కౌన్సిలర్ ఆలె నాగరాజు, నాయకులు గుండెబోయిన వెంకటేశంయాదవ్, కొయ్యడ శేఖర్గౌడ్, రావుల ముత్యాలు పాల్గొన్నారు.