నల్లగొండ : జిల్లాలోని మునుగోడు మండలం కిష్టపురం గ్రామంలోని దళిత వాడలలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల దళిత సమ్మేళనం, వనభోజనాల కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు.
దళిత వాడలలో కలియ తిరుగుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్ పాలనలోనే దళితుల అభివృద్ధి జరుగుతుందన్నారు.
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.