నల్లగొండ, అక్టోబర్ 19 : నల్లగొండ ప్రజలు అభివృద్ధ్దికి కారకులు ఎవరో…అభివృద్ధ్ది నిరోధకులు ఎవరో గుర్తించి తమ ఓట్లు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. నల్లగొండ పట్టణంలోని 20,41,42 వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఇప్పటి దాక మోస పోవడం వల్లనే మోసం జరిగిందని మరోసారి మోస పోతే గోస పడతామనే ఆలోచనతో విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి గెలిపించాలని కోరారు. పట్టణంలో ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలు తన దృష్టికి రాగానే ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అవి పూర్తి స్థ్దాయిలో అమలు కావాలంటే రాష్ట్రంలో సీఎం కేసీఆరే రావాలని అన్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా ఈ సారి అధికారంలోకి రాగానే మార్చి నుండే ఆసరా పింఛన్తో పాటు తెల్ల కార్డు కలిగిన వారికి ఉచిత బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. గతంలో నిత్యం కరంటు సమస్యలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరెంట్ సమస్యలు లేకుండా తెలంగాణ ముం దుకు పోతున్నది అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు సుంకరి మల్లేశ్ గౌడ్, మాలె శరణ్యారెడ్డి, కంచనపల్లి రవీందర్ రావు, సింగం రాంమోహన్, లక్ష్మి, యాట జయప్రదా రెడ్డి, సరోజన రెడ్డి, విజయారెడ్డి, సంకు ధనలక్ష్మి, కత్తుల సంధ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండలో చేపడుతున్న ప్రచారంలో గులాబీ కార్యకర్తలు ఉత్సాహంతో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో గురువారం ప్రచారం చేయగా యువత, మహిళల్లో విశేష ఆదరణ లభించింది. ఉదయం పద్మావతి కాలనీ నుంచి మొదలు పెట్టిన ప్రచారం మధ్యాహ్నం లీలావతి ఆస్పత్రి సమీప కాలనీలు, అంధుల పాఠశాల ప్రాంతాల్లో ఉన్న పలు కాలనీల్లో తిరిగి నల్లగొండ అభివృద్ధ్ది కావాలంటే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కంచర్ల ఓటర్లను అభ్యర్థ్దించారు.