నల్లగొండ, అక్టోబర్ 16 : 20 ఏండ్లుగా నల్లగొండ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండగా సీఎం కేసీఆర్ హామీ మేరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుందని, మరోసారి కంచర్ల భూపాల్రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగనున్నదని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బండ నరేందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి సీఎం కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ నుంచి బీఫాం ఇచ్చిన నేపథ్యంలో సోమవారం కంచర్లతో కలిసి పానగల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
నల్లగొం డ నియోజకవర్గంలో ప్రస్తుతం రూ.1450 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవి పూర్తికావాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి గెలువాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాలు ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి కులం, మతం అని ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తారని, వారి మాటలు నమ్మకుండా కేసీఆర్ విజన్ను నమ్మి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ తాను మొదటిసారి కూడా వెంకటేశ్వరాలయంలో పూజలు చేసి విజయం సాధించానని, ఈసారి కూడా ఇక్కడే పూజలు చేసి ప్రచారం చేస్తున్నందున ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
పానగల్ను గ్రామ వాతావరణం నుంచి పట్టణ వాతావరణంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉదయ సముద్రంతోపాటు అన్ని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని, ఇదే అభివృద్ధి ఆగకుండా ముందుకు సాగాలంటే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
మొదటి వార్డు నుంచి ప్రచారం షురూ..
పూజల అనంతరం ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మధ్యాహ్నం రెండో వార్డులో, సాయంత్రం మూడో వార్డులో ఇంటింటి ప్రచారం చేసి తనను గెలిపించాలని కోరారు. అంతకుముం దు పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా డప్పుచప్పుళ్లు, పటాకుల మోత నడుమ ప్రచారం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్యాదవ్, పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, కొప్పు క్రిష్ణయ్య, ఆలకుంట్ల నాగరత్నంరాజు పాల్గొన్నారు.