నీలగిరి, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆహర్శిశలు కృషి చేస్తున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక ముస్లింల జీవన స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేశారని, మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వచ్చాకే రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ 20ఏండ్లుగా నల్లగొండ ప్రజలను మభ్యపెట్టి మాయ మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రూ.1300కోట్లతో నల్లగొండ పట్టణం నలువైపులా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్ ఎంపీపీ కరీంపాష, మైనార్టీ నాయకులు కలీం, నిరంజన్వలీ, కౌన్సిలర్లు ఖయ్యుంబేగ్, వట్టిపల్లి శ్రీనివాస్, అన్వర్, జాఫర్, సోహెల్, ఉమర్, సలీం పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్కు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్లో చేరికలు
నల్లగొండ పట్టణంలోని వివిధ వార్డుల నుంచి సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ మైనార్టీ యువకులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో ఆదివారం చేరారు. అనంతరం మహ్మద్ షాహిద్ భాయ్, ఎస్కే చాంద్, లడ్డూబాయ్, అబ్దుల్ బారి జీమ్ షాబు, సల్మాన్తో పాటు సుమారు వెయ్యి మంది మైనార్టీ యువకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్ ఎంపీపీ కరీంపాష, మైనార్టీ నాయకులు కలీం, నిరంజన్వలీ పాల్గొన్నారు.