నల్లగొండ సిటీ, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ సారధ్యంలోనే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం పోనుగోడు, కురంపల్లి, రామచంద్రపురం, రేగట్టె, శాబ్దులాపురం, పగిడిమర్రి, దోరెపల్లి, లింగాలగూడెం, వేమిరెడ్డిగూడెం గ్రామా ల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భూపాల్రెడ్డి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏండ్లలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధ్దిని ఐదేండ్ల కాలంలో అభివృద్ధ్ది చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుక్కెడు మంచినీళ్ల కోసం అరిగోస పడ్డారు అన్నారు. ప్రతి గ్రామంలో రూ.కోట్లతో సీసీరోడ్లు, మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏప్రభుత్వం ప్రవేశ పెట్టని పథకాలు సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందు ఎదుర్కోన్నారని రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాను కేసీఆర్ అనేక పథకాలు ఇచ్చి జిల్లాను అభివృద్ధ్దిలో తీసుపోయారని మరోసారి కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుల కటికం సత్తయ్యగౌడ్, ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంటేశం, బీఆర్ఎస్ నాయకుల కంచర్ల కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, సింగిల్విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోతి శ్రీనివాస్, డాక్టర్ చెరుకు సుహాస్, గ్రామసర్పంచులు కడారి కృష్ణయ్య, ఎల్లయ్య, పులకరం ఆండాలూవెంకటేశం, ఎంపీటీసీలు వెంకట్మ్రణరెడ్డి,రవీందర్రెడ్డి ఉన్నారు.