నల్లగొండ, నవంబర్ 11 : ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండను తాను ఈ ఐదేండ్లలో అభివృద్ధ్ది చేస్తున్నానని తనకు మరో అవకాశమిస్తే సంపూర్ణ అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. నల్లగొండ 23,24,44 వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధ్ది మీ కండ్ల ముందు కనబడుతుందని నల్లగొండ పునర్నిర్మాణం కోసం ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ పాలన రాష్ర్టానికి శ్రీ రామ రాక్ష అని ఇందుకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. దశాబ్దాల తరబడి అధికారం వెలగబెట్టిన అభివృద్ధి నిరోధకులు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయనగానే నేడు దొం గల్లా వస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పింఛన్లు పెంచామన్నారు.
మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే పేదోడి కడుపు నింపడం కాదు స్కామ్ల పేరుతో వారి కడుపులు కొడతారని అన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన తమ ప్రభుత్వం వచ్చే ఐదేండ్ల పాటు ప్రజలు మరింత సంతోషంగా ఉండేందుకు కచ్చితంగా చేయబోయే పనులను మ్యానిఫెస్టో రూపంలో ప్రజల ముందు ఉంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన పింఛన్తో పింఛన్దారుల బాధలు తీరాయని, వారు సంతోషంగా ఉండేలా మరింత పెంచి రూ.5వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చేయబోతున్నట్లు చెప్పారు. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేవలం రూ.400కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం అందించ నున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగోని నవీన్, మాతంగి సత్యనారాయణ, చెరుకు సుహాస్, కరణ్ జయరాజ్, కలీం అన్వర్, కత్తుల సంధ్య పాల్గొన్నారు.