మాడ్గులపల్లి, నవంబర్ 27: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధోగతి పాలవుతుందని, కరెంట్తోపాటు రైతుబంధు, రైతు బీమా, పింఛన్ పథకాలు ఆగిపోతాయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడో సారి అధికారంలోకి తీసుకొస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు దేశానికి, రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొండలు, మాజీ ఎంపీటీసీ రేణుకానరేందర్రెడ్డి, నాయకులు వెన్న శ్రవణ్రెడ్డి, గాదె వివేక్రెడ్డి, దర్శనం రాంబాబు, జూపూడి స్టాలిన్, మధుశంకర్, లక్ష్మయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.
తిప్పర్తి, నవంబర్ 27 : తిప్పర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా.. మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తానేదార్పల్లి, కంకణాలపల్లి, కాశీవారిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేండ్లుగా కనిపించని నాయకులు మళ్లీ డబ్బులతో వచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
రైతుల ఖాతాల్లో నేడో, రేపో రైతు బంధు డబ్బులు పడాల్సింది. కానీ కాంగ్రెస్ కుట్రలతో రైతు బంధును ఆపేసి రైతుల నోటికాడి అన్నం గుంజుకున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీవారి గూడేన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్ కొన జానయ్య, నాయకులు లొడంగి గోవర్ధ్దన్, వి.నాగేశ్వర్రావు, కందుల లక్ష్మయ్య, ఎస్ కే కరీం పాషా, ఎస్ కే కలీం, జానయ్య, పురుషోత్తం పాల్గొన్నారు.
సీపీఎం వెంకటాద్రిపాలెం గ్రామ ఉపసర్పంచ్ కాసారపు మంగమ్మ తోపాటు ఐదు కుటుంబాలు సోమవారం తిప్పర్తిలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి
నల్లగొండ : మండలంలోని దోమలపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్ నల్లగొండ మండలాధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కంభంపాటి నగేశ్, నూకల లింగస్వామి, కంభంపాటి రమేశ్, అక్కెన పల్లి సైదులు, శంకర్, గురిజాల శివ, ప్రవీణ్, భీమనపల్లి సురేశ్, నూకల శంకర్లతో పాటు పెద్ద సంఖ్యంలో బీఆర్ఎస్లో చేరారు.
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని 32వ వార్డులోఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోమవారం రాత్రి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్కు మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకులు లేకున్నా ప్రజలే నా నమ్మకం..నా ధైర్యమని ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేస్తానని అన్నారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి నల్లగొండకు ఐటీ హబ్, బత్తాయి మార్కెట్, మెడికల్ కళాశాల తెస్తానని ఎందుకు తీసుకోని రాలేదని కోమటిరెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. కార్యక్రమంలో చెరుకు సువాస్, బోనగిరి దేవేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు.