నల్లగొండ, సెప్టెంబర్ 29: వచ్చే నెల 2న నల్లగొండలో నిర్వహించే రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించే బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో మంత్రి కేటీఆర్ సభ నేపథ్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక లక్ష్మి గార్డెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ నాలుగేండ్లలో నల్లగొండలో రూ. 1800 కోట్లతో కనీవినీ ఎరుగని రితీలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్తో పాటు ,మంత్రు లు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారం వల్ల ఈ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఐటీ మంత్రిగా చేసిన కోమటిరెడ్డి నల్లగొండలో కనీసం ఐటీ హబ్ కూడా ఏర్పాటు చేయలేదని , తాను ఎంతో పోరాటం చేసి ఇక్కడ ఈ ఐటీ హబ్ను ఏర్పాటు చేయించనన్నారు.
అభివృద్ధి కొనసాగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి
నల్లగొండలో ప్రయాణ చేస్తుంటే ఇతర దేశాల్లో తిరిగిన ఫీలింగ్ కలుగుతుందటే దానికి కారణం రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే అన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మరో సారి బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. అక్టోబర్ 2న నల్లగొండలో నిర్వహించే కేటీఆర్ ప్రగతి నివేదన సభకు ప్రతి ఇంటి నుంచి తరలిరావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, కనగల్ ఎంపీపీ , జడ్పీటీసీలు కరీం పాషా, చిట్ల వెంకటేశం, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి , పీఏసీఎస్ చైర్మన్లు నాగరత్నం రాజు , సహదేవరెడ్డి, శ్రీనివాస్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ, నల్లగొండ, కనగల్ ,తిప్పర్తి మండలాల అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్రెడ్డి, బకరం వెంకన్న, కొండూరు సత్యనారాయణ, మాలె శరణ్యారెడ్డి, బొర్ర సుధాకర్, సింగం లక్ష్మి, దుబ్బ రూపా, కొప్పోలు విమలమ్మ, స్వరూప , రేణుక పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిక
నల్లగొండ: కనగల్ మండలంఇరుగంటి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి చేరిన వారిలో నామిరెడ్డి నర్సిరెడ్డి, మొగుదాల గిరి, శంకర్, బీజేపీ నుంచి చిట్టిమల్ల భిక్షం, రాజు, మనిమద్దె రవి, పోలె యాదయ్య, ఆదిమల్ల భారతమ్మ, నాగమ్మ, మొగుదాల యాదగిరి, మద్దెల వెంకటేశం ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ కరీంపాషా, చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ కనగల్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి పాల్గొన్నారు.