నల్లగొండ : నల్లగొండ మరింత అభివృద్ధికి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి ప్రజలను కోరారు. చాడ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 3,44వ వార్డుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల, చాడ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్కే పట్టం కట్టనున్న నేపథ్యంలో నల్లగొండలో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు.
కొందరు డబ్బు కట్టలకు అమ్ముడుబోయి ఆత్మాభిమానాన్ని కోమటిరెడ్డి వద్ద తాకట్టు పెట్టారని అలాంటి వాళ్లకు ఈ ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీలో చేరిన వారిలో కొంగర రఘు, పాత పల్లె నుంచి లచ్చ య్య, మల్లికార్జున్, లోహిత్, గోపి, శ్రీనివాస్, నాగరాజు, లింగయ్య, నర్సింగ్ బాలస్వామి, గుండు లింగయ్య, పోకల యాదయ్య, బలిశెట్టి శంకర్, సుధాకర్ ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, పేర్ల జానయ్య, వట్టిపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, జనార్దన్రావు, రహీంఖాన్, పేర్ల అశోక్, జనార్దన్ పాల్గొన్నారు. అదేవిధంగా నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో 24వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు కత్తుల యశ్వంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో పలువురు చేరారు. పార్టీలో చేరిన వారిలో చంటి, సిద్దు, సాయి, బబ్లూ, గణేశ్, మహేశ్, నితిన్, మనీశ్ సాయి ఉన్నారు.