త్రిపురారం, ఫిబ్రవరి 4: ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ రివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దదేవులపల్లిలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే నూటికి 90శాతం జబ్బుల నుంచి బయటపడవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ అంబటి రాము, నాయకులు ముడిమళ్ల బచ్చిరెడ్డి, భాస్కర్, గుండెబోయిన కోటేశ్యాదవ్, గ్రామ పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సింగం రామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి ఆదివారం రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు ధనావత్ భాస్కర్నాయక్, అంబటి రాము, సింగం వెంకన్న, గుండెబోయిన నగేశ్, కూరపాటి సైదులు, సోమయ్య ఉన్నారు