రామగిరి, డిసెంబర్ 31 : 2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కేక్ కటింగ్లు చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఒకరికొకరు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కొత్త సంవత్సరం అంతా మంచి జరుగాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు జోరుగా సాగాయి. ఉమ్మడి నల్లగొండ చిన్నా, పెద్ద సంబురాల్లో పాల్గొన్నారు. యువత విందు వినోదాలతో ఎంజాయ్ చేశారు.
మార్కెట్లలో కొనుగోళ్ల సందడి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడాయి. కేకులు, స్వీట్ల అమ్మకాలు జోరుగా సాగాయి. మద్యం, మాంసంతోపాటు పటాకుల విక్రయాలు అదే స్థాయిలో జరిగాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా సందడి కనిపించింది. పలు కాలనీలు, అపార్ట్మెంట్స్లో న్యూ ఇయర్ వేడుకలను సామూహికంగా జరుపుకోవడంతో పండుగ శోభ ఉట్టిపడింది.
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపకుండా డ్రంగ్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ప్రజలకు ప్రజా ప్రతినిధుల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించాలని ఆకాంక్షించారు. న్యూ ఇయర్ వేడుకులను సంతోషంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు.