సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. రా జ్యాంగ సంస్థలన్నింటినీ బీజేపీ తన జేబు సంస్థలుగా మార్చిందని మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయబోమని ఈడీ గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పటికే పలుమార్లు పిలిచినా కవిత విచారణకు హాజరై కావాల్సిన సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తున్నదన్నారు. వారు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే ైప్లెట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరితే కేసులు రద్దు చేస్తున్నారని లేకపోతే వేధిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకునేందుకు బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదన్నారు. అనేక రాజకీయ పార్టీల నాయకులను ఇలాగే లొంగతీసుకుని తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి ఎదురు నిలబడింది దేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.