తుంగతుర్తి, నవంబర్ 11 : తుంగతుర్తి నియోజక వర్గంలో గత 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపించినట్లు.. అభివృద్ధి చూసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని ఏనకుంటతండా, మానాపురం, రావులపల్లి ఎక్స్రోడ్, రావులపల్లి, బాపన్నబావితండా, గొట్టిపర్తి, వెంపటి, సింగారంతండా, కాశీతండా గ్రాయాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పింఛన్లు, కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ, రైతు బంధు, రైతు బీమా పథకాలే కాకుండా గెలిచిన అనంతరం కేవలం రూ.400కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం, నియోజక వర్గంలోని దళితులందరికీ దళిత బంధును అమలు చేయనున్నట్లు తెలిపారు. 24 గంటల కరెంట్ కావాలన్నా, పథకాలన్నీ తిరిగి పొందాలన్నా మూడోసారి ముచ్చటగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు ప్రజలు నమ్మోద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గుండగాని రాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, దొంగరి శ్రీను, మట్టిపల్లి వెంకట్, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేశ్గౌడ్, గోపగాని శ్రీను, గునగంటి సంతోశ్, ఎంపీటీసీ కేతిరెడ్డి లతారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు చందా వెంకన్న, వెంకన్ననాయక్, యాకూనాయక్, పరమేశ్, విజ్జు, పూర్ణానాయక్ పాల్గొన్నారు.