నాగారం, జూన్ 5 : ఒకనాడు చీకట్లో ఉన్న తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు నింపిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని 132/32 కేవీ సబ్స్టేషన్లో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేల కోట్లు చెల్లించి రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ తన మేధస్సుతో రాష్ర్టాన్ని విద్యుత్ వెలుగులతో నింపి.. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటిగా మారుతుందని చెప్పిన ఆంధ్రా పాలకులకు ధీటైన సమాధానం చెప్పారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాల నియోజకవర్గ ఇన్చార్జి, పీడీ కిరణ్కుమార్, ఎంపీపీ కూరం మణి వెంకన్న, విద్యుత్ డీఈలు శ్రీనివాస్, రాజశేఖర్, ఏడీలు అరుణ్కాంత్, శ్రీనివాస్, ఏఈ మహేంద్రనాథ్, తాసీల్దార్ గోలి హరిశ్చంద్రప్రసాద్, ఎంపీడీఓ గాలి శోభారాణి, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమ్మినేని స్రవంతీ సతీశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, గుండగాని అంబయ్యగౌడ్, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.