నమస్తే : కిశోర్గారు మీరు ఎమ్మెల్యే కాకముందు తుంగతుర్తిలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి?
ఎమ్మెల్యే కిశోర్ : ఒకప్పుడు తుంగతుర్తి నియోజక వర్గం కక్షలు, గొడవలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. నాడు ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకున్న నాథుడు లేడు. కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సోయి చూపిన లీడర్ ఒక్కరూ కూడా లేకుండే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నది. కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైన తుంగతుర్తి పచ్చని మాగాణిగా మారింది. అభివృద్ధికి దూరంగా ఉన్న తుంగతుర్తి ప్రజలను అన్ని రంగాల్లో మందుండేలా ఎమ్మెల్యేగా నా బాధ్యతలను నిర్వర్తించాను. భవిష్యత్లో కూడా ఇదే బాధ్యతను కొనసాగిస్తాను.
ఎమ్మెల్యే కిశోర్ : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీలకంగా ఉన్నా. విద్యార్థిగా, యువకుడిగా ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించాను. 2001లో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ప్రతి ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాను. 2004 నుంచి 2014 వరకు కేసీఆర్, కేటీఆర్తో కలిసి నడిచాను. నాడు ఏర్పాటైన విద్యార్థి జేఏసీ అన్ని బాధ్యతలను భుజాన వేసుకుని జేఏసీకి కన్వీనర్గా వ్యవహరించా. విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా పోరాట కార్యచరణలో కార్యోన్ముఖుడిని అయ్యాను. విద్యార్థి ఉద్యమ బలోపేతం, సమైక్యాంధ్ర పాలనకు వ్యతిరేకంగా పోడాడినందుకు నాపై దాదాపు 172 పోలీస్ కేసులు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి రెండు, మూడు నెలలు జైలులో ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు నడిచాను.
ఎమ్మెల్యే కిశోర్ : 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత యావత్ తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించాలంటే ప్రజల సోయున్నవాళ్లు, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేవాళ్లు ఎమ్మెల్యేలు అయితే సాధ్యమౌతుందని కేసీఆర్ భావించి 2014లో తుంగతుర్తి నుంచి నాకు బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. కేసీఆర్ ఆశీస్సులు, కేటీఆర్ అడుగుజాడల్లో, జగదీశ్రెడ్డి సహకారంతో తుంగతుర్తి ప్రజలు నన్ను మొదటిసారి దీవించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు.
నమస్తే : శాలిగౌరారం, మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు ఇంకా నీళ్లు అందడం లేదు కదా ?
ఎమ్మెల్యే కిశోర్ : మిగతా మండలాలకు కూడా సాగునీరు అందించాలనే ధృఢ సంకల్పంతో ఆసీఫ్నగర్ కాల్వ నుంచి అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శాలిగౌరారం మండలానికి సాగు నీరు తీసుకువస్తా. బునాదిగాని కాల్వ నుంచి మూసి నది జలాలను అడ్డగూడూరు మండలానికి తీసుకురావాల్సి ఉన్నప్పటికి, మూసీ జలాలను తరలించే అనుకూల పరిస్థితులు లేక కాల్వకు బస్వాపుర్ రిజర్వాయర్ ద్వారా నీటిని తరలించేందుకు పనులు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యే కిశోర్ : కొత్త ఆరోగ్య సబ్ సెంటర్ల ఏర్పాటు, తుంగతుర్తిలో 100 పడకల దవాఖానను మంజూ రు చేయించడం జరిగింది. దాంతో పాటు ఆస్పత్రిలో ఆధునీకరణ పనులు చేయించా. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపా.
ఎమ్మెల్యే కిశోర్ : ప్రస్తుతం తుంగతుర్తి నియోజక వర్గం సస్యశ్యామలంగా మారడంతో ఒకప్పుడు ఊర్లు విడిచి వలస వెళ్లిన వాళ్లు ఊర్లకు తిరిగి వస్తున్నారు. ఇక్కడే ఉపాధి లభిస్తుండడంతో హాయిగా జీవిస్తున్నారు. నేడు నియోజక వర్గంలో కక్షపూరిత రాజకీయాలు, హత్యలు, అరాచకాలు, అక్రమ కేసులు లేవు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు.
ఎమ్మెల్యే కిశోర్ : సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన మార్గదర్శి కేసీఆర్ను హ్యట్రిక్ సీఏంగా ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆకలిపై యుద్ధం ప్రకటించి సాగును బాగుచేసి పచ్చదనాన్ని పరిచారు. నీటిని కొండలు ఎక్కించి అన్నదాతకు అండగా నిలిచారు. అపర భగీరథుడై ఇంటింటా గంగావతారాన్ని ఆవిష్కరించారు, పింఛన్లు పెంచి మలిసంధ్యకు చేతికర్ర అయ్యారు. కుల వృత్తులను గుండెకు హత్తుకుని దళిత బంధువై సామాజిక సమానత్వ పతాకాన్ని ఎత్తుకుని సగర్వ తెలంగాణగా సీఎం కేసీఆర్ నిలిపారు. తుంగతుర్తి నియోజక వర్గాన్ని రూ.5,641.7 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేశా. మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టితో గెలిపించి ఆశీర్వదించాలని తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
ఎమ్మెల్యే కిశోర్ : నేనే తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికఅయ్యేటప్పటికి నియోజక వర్గంలో భయానక పరిస్థితులు ఉండేవి. అభివృద్ధి మాటే లేదు. ఉపాధికి అవకాశం లేదు. సాగుకు నీళ్లు లేవు. పంట దిగుబడి అంతంత మాత్రమే. ఆస్పత్రుల్లో వసతులు లేవు. పాఠశాలలకు సౌకర్యాలు లేవు. రోడ్లు అసలే లేవు. అంతకు మించి శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉండేది. దాంతో రెండు నెలలు నియోజక వర్గం మొత్తం పర్యటించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశా. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చి కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు నీటిని అందించా. పచ్చని పంటల నియోజక వర్గం తుంగతుర్తిని తీర్చిదిద్దానని సగర్వంగా తెలుపుతున్నాను. కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నాగారం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు వ్యవసాయానికి పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి.
సమస్తే : నియోజక వర్గానికి కాళేశ్వరం జలాలు వచ్చిన తర్వాత పంట దిగుబడి పెరిగిందా?
ఎమ్మెల్యే కిశోర్ : కాళేశ్వరం జలాలతో సాగు పండుగై.. రైతు బంధుతో సాగు నిండుగై వ్యవసాయ ఆయకట్టు పెరుగడమే కాక పంట దిగుబడి 2014 తర్వాత ఐదు రెట్లు పెరిగింది. 2014లో 41,469 ఎకరాల నుంచి 74,644 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయ్యేది. ప్రస్తుతం 1,40592 ఎకరాల్లో 3,93,657 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతుంది. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ఇదే సాక్ష్యం.
ఎమ్మెల్యే కిశోర్ : విద్యాభివృద్ధి కోసం అనేక ప్రభుత్వ విద్యాసంస్థలను నియోజక వర్గానికి తీసుకువచ్చా. వెనుకబడిన తుంగతుర్తి ప్రజలకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంటర్ స్థాయి విద్యా అవకాశాలు ఉన్న గురుకుల, మోడల్, కస్తూరీబా గాంధీ విద్యాలయాలను తీసుకువచ్చాను. అడ్డగూడూరు మండలంలో కస్తూర్భా, సోషల్ వెల్ఫేర్ విద్యాలయం, తుంగతుర్తిలో సోషల్ వెల్ఫేర్, ట్రైబర్ వెల్ఫేర్, మైనార్టీ గురుకులం, మద్దిరాలలో కస్తూర్భా స్కూల్, మోత్కూర్లో కస్తూర్భా, నాగారం మహాత్మా జ్యోతిరావు పూలే విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేశాను.మన ఊరు మన బడి కార్యక్రమం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా.