మద్దిరాల, నవంబర్ 14 : పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఎంత భద్రంగా, హాయిగా ఉంటుందో అలాగే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉంటేనే మన భవిష్యత్ బాగుంటుందని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని చిననెమిల, గుట్టకాడితండా, మామిండ్లమడవ, తూర్పుతండా, జి కొత్తపల్లి, ముకుందాపురం, మద్దిరాల గ్రామాల్లో వాడవాడలా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇంతకు రెట్టింపుతో అమలు కావాలంటే కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలవాలంటే కారు గుర్తు మీద ఓటు వేయాలని సూచించారు. మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్య బీమా, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు అందివ్వనున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో 11 వేల మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు.
మన సంక్షేమం కోసం ఆలోచన చేసిందెవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే సమున్నత లక్ష్యంతో 24 గంటల కరెంట్ ఇస్తూ ధరణి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పక్కాచేసి రైతు బంధుతో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. మరోమారు అవకాశం ఇస్తే పంట పెట్టుబడి సాయం ఎకరాకు రూ.16 వేలు ఇవ్వనున్నట్లు వివరించారు. ఎన్నికలప్పుడు రంగుల జెండాలు ఏసుకొని వచ్చి అటు ఇటు ఎగిరే ప్రయత్నం తప్పా మళ్లా ఓడిపోతే ఐదేండ్లు కనపడని ప్రతిపక్ష నాయకులను ప్రజలు నిలదీయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, వైస్ జడ్పీటీసీ కన్న సురాంబావీరన్న, ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్రావు, మల్లు కపోతంరెడ్డి, ఆకుల ఉప్పలయ్యగౌడ్, సర్పంచులు సూరారపు గౌతమిరాజు, భూక్య లక్ష్మీవీరన్న, అక్కిరెడ్డి జ్యోతీఉపేందర్రెడ్డి, షేక్ ఇంతియాజ్ రజాక్, ఎంపీటీసీలు సుంచు అవిలయ్య పాల్గొన్నారు.
అభివృద్ధికి అండగా బీఆర్ఎస్లో చేరికలు ; ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి అండగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. మండలంలోని మాధారం కలాన్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 కుటుంబాలు తిరుమలగిరిలోని ఎమ్మెల్యే కిశోర్కుమార్ నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మామిడి సర్వయ్య, మామిడి రమేశ్, తోటకూరి వంశీ, షరీఫ్ తదితరులు ఉన్నారు.