కేతేపల్లి, జూలై 14 : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మనం నంబర్1 అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. మండలంలోని ఇనుపాముల ఆవాస గ్రామమైన రాయపురానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పసల ప్రేమ్సాగర్తో పాటు 100మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఆయన సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నదని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మాదాను లూర్దుకొండయ్య, సెబిస్టీన్, పసల జోజప్ప, ప్రకాశ్, బాలకుమార్, విజయ్, ఇన్నయ్య ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, గ్రామ సర్పం చ్ జాల వెంకట్రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ కానుగు యాదగిరిగౌడ్, నాయకులు చల్ల కృష్ణారెడ్డి, బొజ్జ అరవింద్, వేణుమాధవరెడ్డి, కె.సైదిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, సైదులుగౌడ్ పాల్గొన్నారు.
పామనుగుండ్లలో 50కుటుంబాలు చేరిక
కట్టంగూర్ : మండలంలోని పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 50ముదిరాజ్ కుటుంబాల వారు నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో బొందు సైదులు, కాడబోయిన జానయ్య, శంకరయ్య, కొరివి సత్తయ్య, సాలయ్య, లింగస్వామి, రాజు, వెంకన్న ఉన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెరుకు నర్సింహ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఉండాల శ్రీను, నాయకులు బండారు విజయ్కుమార్, గణేశ్ పాల్గొన్నారు.