రామన్నపేట, జూన్ 20 : సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జనంపల్లిలో మన ఊరు- మనబడి కింద మరమ్మతు చేపట్టిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, డ్రెస్లను, రాగిజావను అందజేశారు. అనంతరం గ్రా మంలో రూ. 20 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను, డ్రైనేజీ నిర్మాణపనులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్కు ధీటుగా సకల వసతులతో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య, నోట్పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
సర్పంచ్ రేఖాయాదయ్యఅధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, ఎంపీటీసీ వేమవరపు సుధీర్బాబు, సర్పంచులు ఎడ్ల మహేందర్రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, కోళ్ల స్వామి, తాసీల్దార్ అశోక్రెడ్డి, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, ఎంఈఓ శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షకార్యదర్శులు మందడి ఉదయ్రెడ్డి, పోశబోయిన మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షుడు బండా దమోదర్రెడ్డి, పున్న జగన్మోహన్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, బొక్క పురుషోత్తంరెడ్డి, బీఆర్ఎస్వై అధ్యక్షుడు బత్తుల వెంకటేశం, నక్క నరేందర్ పాల్గొన్నారు. v నార్కట్పల్లి : మహాత్మాజ్యోతీబా పూలే గురుకుల జూనియర్ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం అలపించారు. ఆయన వెంట కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్తోనే ప్రభుత్వ విద్య బలోపేతం
కేతేపల్లి : మండలంలోని గుడివాడ గ్రామంలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.అనంతరం గ్రామంలో రూ.20 లక్షలతో కొత్తగా నిర్మించనున్న హెల్త్ సబ్సెంటర్ నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. మన ఊరు-మనబడి నిధులతో నేడు పాఠశాలల్లో ఆహ్లాదరకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు. సర్పంచ్ కట్ట శ్రవణ్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, నాయకులు బంటు మహేందర్, లింగయ్య పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి గ్రామంలో మన ఊరు మన బడి పథకం ద్వారా మరమ్మతు అనంతరం తరగతి గదులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు . ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వి ద్యార్థులకు యూనిఫామ్, రాగి జావను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కొందరు సర్పంచులు తమ బాధ్యతను విస్మరించి గ్రామాల్లో జరిగే అభివృద్ధ్ది కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అది వారికే నష్టమని అన్నారు . గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రూ. 15 లక్షల సీసీ రొడ్లను మంజూ రు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, ఎంఈఓ నర్సింహ, ఎంపీఓ పద్మ, పంచాయతీ రాజ్ డీఈ విష్ణువర్ధ్దన్రావు, హెచ్ఎం జానకి, సింగిల్ విండో, మున్సిపల్ వైస్ చైర్మన్లు మెండె సైదులు, కూరెళ్ల లింగస్వామి, నాయకులు కర్నాటి ఉప్పల వెంకట్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, పీ. నరేందర్రెడ్డి, నర్రా శ్రీకాంత్రెడ్డి , మేడి రాజు బిక్షంరెడ్డి, మేడి ఉపేందర్, హరికృష్ణ పాల్గొన్నారు. చిట్యాల, ఉరుమడ్ల, నేరడ, చిట్యాల గ్రీన్ గ్రూవ్ పాఠశాలలతో పాటు పలు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు.
నకిరేకల్: మండలవ్యాప్తంగా అన్ని పాఠశాలలో విద్యా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ కవుల వేషధారణలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రజాప్రతినిధులతో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమాలలో మున్సిపల్ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గోపాల్, కౌన్సిలర్ గడ్డం స్వామి, పాలెం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పోగుల నర్సింహ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.