రామన్నపేట, అక్టోబర్ 6: ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యం అందిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రెడ్డి, అంబేద్కర్, పద్మశాలీ, గౌడ సంఘాల భవన నిర్మాణ పనులతో పాటు పల్లె దవాఖానకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దేశం గర్వించేవిధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబంలో మనో ధైర్యాన్ని, సంతోషాన్ని కల్పిస్తుందన్నారు. ప్రతి పక్షాలకు దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మెనిఫెస్టో రాబోతుందన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, సర్పంచులు గుత్తా నర్సింహరెడ్డి, ఎడ్ల మహేందర్రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, ఉప్పు ప్రకాష్, ఎంపీటీసీలు గొరిగే నర్సింహ, తిమ్మాపురం మహేందర్రెడ్డి, వేమవరపు సుధీర్బాబు, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ప్రధానకార్యదర్శి పోశబోయిన మల్లేశం, మార్కెట్ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఆవుల నరేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, నీల దయాకర్, అంతటి రమేశ్, మందడి సాగర్రెడ్డి, బందెల రాములు, కూనూరు ముత్తయ్య, ఆముద లక్ష్మణ్, పద్మశాలీసంఘం అధ్యక్షకార్యదర్శులు రచ్చ యాదగిరి, ప్రధానకార్యదర్శి కైరకొండ నాగభూషణం పాల్గొన్నారు.
కట్టంగూర్ : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని అయిటిపాముల, రామచంద్రాపురం గ్రామాల్లో రూ.41 లక్షలతో నిర్మించినున్న సీసీ రోడ్డు, చెర్వుఅన్నారంలో బయో పర్టిలైజర్ ఆర్గానిక్ వెజిటేబుల్ వెస్ట్ ఎరువుల తయారీ భవనానికి శంకుస్థాపన, గంగదేవిగూడెంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ లిమిటెడ్ కంపెనీలో సోలార్ కోల్డ్ రూమ్, లెమెన్ గ్రేడింగ్ మిషన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్కు లేదని, ఆ పార్టీ నాయకుల మాటలకు ప్రజలు మోసపోవద్దన్నారు. రైతులందరినీ సంఘటిత చేసేందుకు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన జిల్లా అధికారి సంగీతలక్ష్మి, నాబార్డు డీడీఎం వినయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటీసీలు తరాల బలరాములు, మాద ధనలక్ష్మి, రామచంద్రాపురం సర్పంచ్ ప్రియాంక, ఎంపీటీసీలు బెల్లి మహాలక్ష్మీసుధాకర్, నల్లమాద వీరమ్మాసైదులు, ఏఓ శ్రీనివాస్, బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, నాయకులు చౌగోని నాగరాజు, నర్సింగ్ రవి, అనంతుల సైదులు, బెల్లి రవి పాల్గొన్నారు.
చిట్యాల: చిట్యాల పట్టణంలో రూ.36లక్షలతో నూతనంగా నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందించే లింకేజీ రుణాలతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, ఎంపీడీఓ లాజర్ పాల్గొన్నారు.
నకిరేకల్: మండలంలోని ఓగోడు గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, కమిషనర్ బాలాజీ, ఎంఈఓ మేక నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ పట్టణానికి చెందిన మాచర్ల వెంకన్న శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. వెంకన్న మృతదేహానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు.