చిట్యాల, నవంబర్ 11 : ప్రతి పక్ష పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దని అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వనిపాకల, వట్టిమర్తి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉన్న పథకాలను పకడ్బందీగా అమలు చేయడంతోపాటు మరెన్నో కొత్త పథకాలు అమలవుతాయని వివరించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్డు షోలో మాట్లాడుతూ ప్రతి పక్ష పార్టీల నాయకులు అచరణ సాధ్యంకాని హామీలను ఇస్తూ ప్రజలను అయోమయం చేస్తుందని విమర్శించారు.
గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఇటీవల పార్టీ మారిన ఓ వ్యక్తి గతంలో ఇదే ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధ్ది చేయకపోగా ప్రజలను భయాందోళనకు గురి చేశారని వివరించారు. మరోసారి అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నియోజకవర్గం మరింత వెనకబాటుకు గురవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమ పథకాలకు స్వర్ణయుగం అన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ శేపూరి రవీందర్, కర్నాటి ఉప్పల్రెడ్డి, మేడి ఉపేందర్, మేడి యాదయ్య, శ్రీకాంత్రెడ్డి, మేడి రాజు, పర్నె నరేందర్రెడ్డి, జాల పద్మ పాల్గొన్నారు.
రామన్నపేట : ఎమ్మెల్యేగా మరోసారి అవకాశ మిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కుంకుడుపాముల, ఎన్నారం, కక్కిరేణి గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి తనకు కేటాయించిన కారు గుర్తుపై ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆరే బలమని, వేరే ఎవరు వచ్చిని అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని ఆగమాగం చేస్తారన్నారు. ఒక కుటుంబం లాగా రాష్ర్టాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు తీసుకెళ్తూ దేశం గర్వించే విధంగా అవార్డులు, ప్రశంసలు పొందుతున్నామన్నారు. ప్రాణాలను తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుర్చీలకోసం కొట్లాడుకునే దొంగల చేతిలో పెట్టొదన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం అందించాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో నాలుంగేండ్లలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలే బేరీజు వేసుకొని ఓటు వేయాలన్నారు. సౌమ్యుడు చిరుమర్తి లింగయ్యను మరోసారి గెలిపించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న పాలనను కొనసాగించుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, సర్పంచులు పిట్ట కృష్ణారెడ్డి, మెట్టు మహేందర్రెడ్డి, బొక్క యాదిరెడ్డి, ముత్యాల సుజాత, ఉపసర్పంచ్ ముప్పిడి దయాకర్, పులిగిల్ల పరమేశ్, కొండూరి శంకర్, గుండు రమేశ్ నాయకులు సోమనబోయిన సుధాకర్యాదవ్, కడారి స్వామి, యాదవ్ బందెల రాములు, అంతటి రమేశ్, బొక్క పురుషోత్తంరెడ్డి, సతీశ్ పాల్గొన్నారు.
చిట్యాల, నవంబర్ 11 : బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు చిట్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం అసోసియేషన్ కార్యాలయం వద్దకు ఎమ్మెల్యేను వారు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే లారీ ఓనర్స్ అసోసియేషన్కు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గతంలో పలు సమస్యలు పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అందరూ తన గెలుపు కోసం తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. సంఘం అధ్యక్షుడు జగిని భిక్షంరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తికి లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎల్లప్పుడు సహకరిస్తామన్నారు. ల మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడుపొన్నం లక్ష్మయ్య, నాయకులు వనమా వెంకటేశ్వర్లు, పాటి మాధవరెడ్డి, శేపూరి రవీందర్, గుండెబోయిన సైదులు, గోధుమగడ్డ జలంధర్రెడ్డి, బెల్లి సత్తయ్య, జమాండ్ల శ్రీనివాసరెడ్డి, సిలివేరు శేకర్, చిత్రగంటి ప్రవీణ్, కోనేటి యల్లయ్య పాల్గొన్నారు.