కేతేపల్లి, నవంబర్ 16 : ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిమోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేతేపల్లి,తుంగతుర్తి గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం లో నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్ని రోజులు అభివృద్ధ్దిని చేపట్టని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలతో నేడు ప్రజల ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ దింపుడుగల్లం ఆశలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 3 గంటల విద్యుత్తో వ్యవసాయం చేయాలని మాట్లాడిన రేవంత్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పూటకోమాట మాట్లాడుతూ మతిలేని వాడిలా మారాడన్నారు. రాజకీయ లబ్ధ్దికోసం తమ్ముడిని వేరే పార్టీకి పంపిన నీచమైన సంస్కృతి వెంకట్రెడ్డిదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు.ఎమ్మెల్యే అభ్యర్ధి చిరుమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఐదేండ్లుగా నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎలాంటి అక్రమ కేసులు లేకుండా లా అండ్ ఆర్డర్లో వ్యత్యాసాలు లేని పాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నాలుగున్నరేండ్లుగా పార్టీని వాడుకొని నేడు ఇతర పార్టీల వైపు వెళ్లిన వారి వైఖరి తెలిసి వందల మంది యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఇన్నాళ్లు పార్టీ పేరు చెప్పుకొని పార్టీని బలహీనపర్చేందుకు ప్రయత్నించిన వ్యక్తులకు త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధ్ది చెప్పాలని కోరారు.
ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అండతో భారీ మెజార్టీని తీసుకురావాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పార్టీ కార్యదర్శి చిముట వెంకన్నయాదవ్, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్యాదవ్, తుంగతుర్తి సర్పంచ్ కొండా సరితాసైదులుగౌడ్, కేతేపల్లి ఎంపీటీసీ ఎర్రబోయిన వెంకన్నయాదవ్, సర్పంచులు, బచ్చు జానకీరాములు, కె.శ్రవణ్, జె.వెంకట్రెడ్డి, నాయకులు గోలి వేణు మాధవరెడ్డి, చల్ల కృష్ణారెడ్డి, బంటు మహేందర్, మాందాసు విజయరాణి, డి.లక్ష్మణ్యాదవ్, పలువురు ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
నకిరేకల్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే నకిరేకల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కోరారు. నకిరేకల్మున్సిపాలిటీ పరిధిలోని 17, 18, 19, 20 వ వార్డుల్లో గురువారం ఇంటింటికీ కలియ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్ పట్టణాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని, పట్టణ ప్రజల కోసం రూ.32 కోట్లతో 100 పడకల ఆస్పత్రి తీసుకొచ్చానని, రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయిస్తున్నానన్నారు. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా సీఎం కేసీఆర్ అమలుచేశాడని, మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలన్నారు.
నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, నలగాటి ప్రసన్నరాజ్, చెరుకు లక్ష్మి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు పల్లె విజయ్, చౌగోని రాములమ్మ సైదులు, వార్డు ఇన్చార్జిలు మురారిశెట్టి కృష్ణమూర్తి, నడికుడి వెంకటేశ్వర్లు, రావిరాల మల్లయ్య, రాచకొండ వెంకన్న, కొండ జానయ్యగౌడ్, రాచకొండ శ్రవణ్, కొండ శ్రీను, దైద పరమేశ్ పాల్గొన్నారు.
చిట్యాల: మండలంలోని వట్టిమర్తి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హన్మంతు, ఆలయ బాధ్యుడు ఇమ్మడి వెంకటేశ్వర్లు, రంగా వెంకటేశ్వర్లు, కూనూరు సంజయ్దాసు, జమాండ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.