నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో పేదింటి కుటుంబాలు బాగుపడ్డాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని శబరి గార్డెన్స్లో 69 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో చెప్పలేనన్ని సంక్షేమ పథకాలకు లెక్కలేనంత డబ్బులను వెచ్చించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీఆరెఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
అనేక ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కేసీఆర్ అని ప్రశంసించారు. అందరి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.