కట్టంగూర్, డిసెంబర్ 5 : గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎరసానిగూడెంలో వైకుంఠధామాన్ని ప్రారంభించి రూ.30లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించనున్న సీసీరోడ్లు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులు, సబ్బండ వర్గాల సంక్షేమానికి పారద్శకంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సేనని పేర్కొన్నారు.
అనంతరం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, సర్పంచులు సిరిగిరెడ్డి వినోదాశేఖర్రెడ్డి, వడ్డె సైదిరెడ్డి, పరశురాములు, పనస సైదులు, ఎంపీటీసీలు ఎడ్ల పురుషోత్తంరెడ్డి, పాలడుగు హరికృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, ఉప సర్పంచ్ ఆకిటి వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు శ్రీరామోజు సత్యనారాయణచారి, బండారు రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.