నల్లగొండ : నార్కట్పల్లి మండలంలోని ఏనుగులదోరి గ్రామం, నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని ఏనుగులదొరి గ్రామంలో రూ.5 లక్షలు, ఎడవెళ్లి గ్రామంలో రూ.5 లక్షలు, నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో రూ.8 లక్షల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అలాగే వివిధ అనారోగ్య కారణాల చేత హాస్పిటల్ లో వైద్యం పొంది సీఎం సహయనిదికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెర్వుగట్టు దేవాలయ చైర్మన్ మేకల అరుణా రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.