నల్లగొండ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలం నడిగూడెం గ్రామంలో పల్లె ప్రగతి, బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంపొందించడాని, పంచాయతీ పాలనలో పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
ప్రభుత్వ భూములు ఉన్న చోట హరితహారం కార్యక్రమం చేపడుతామన్నారు. అభివృద్ధిలో పట్టణాలతో పల్లెలు పోటీపడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రమదానాలు నిర్వహించి పాఠశాలల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.