నకిరేకల్, డిసెంబర్ 31 : రాష్ట్రంలోని పేదల ఆపద్బాంధవుడు ముఖ్యమ్రంతి కేసీఆర్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. శనివారం నకిరేకల్లోని తన క్యాంపు కార్యాలయంలో కేతేపల్లి మండలం కొత్తపేటకు చెందిన ఇట్టిమల్ల నరేశ్కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2.50 లక్షలు, ఉప్పలపహాడ్లోని ఏర్పుల నాగరాజుకు లక్ష రూపాయల ఎల్ఓసీ పత్రాలను వారి కుటుంబసభ్యులకు అందజేసి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు కాపాడటంలో ముందుంటానన్నారు. ప్రాణపాయ స్థితిలో వైద్యం చేయించుకోలేని పేదలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, కొత్తపేట సర్పంచ్ బచ్చు జానకీరాములు, నాయకులు బంటు మహేందర్, దాసరి సుధాకర్, దాసరి లింగయ్య, రాములుగౌడ్ పాల్గొన్నారు.
పీఆర్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీ యూ టీఎస్) ఆధ్వర్యంలో రూపొందించిన 2023 క్యాలెండర్ను శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రదీప్రెడ్డి, పీఆర్టీయూ మండలాధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
కేతేపల్లి : మండలంలోని కొత్తపేటకు చెందిన పట్టేటి కిరణ్, తండు అనంతమ్మ ఇటీవల మరణించారు. శనివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మృతుల కుటుంబాలను పరామర్శించారు. కిరణ్ కుటుంబ సభ్యులకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట సర్పంచ్ జానకీరాములు, ఉపసర్పంచ్ రాములుగౌడ్, సునీత, సైదులుగౌడ్, లింగయ్య ఉన్నారు.