కట్టంగూర్, మే 25 : సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పెరిందేవిగూడెం గ్రామ వార్డు సభ్యులు బొల్లెద్దు నర్సింహ, రేకల సైదులు, ఉబ్బని కృష్ణయ్య, కుర్ర శంకర్తో పాటు వివిధ పార్టీలకు చెందిన 100మంది నాయకులు, కార్యకర్తలు నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకొచ్చాకే గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్కు అండగా ఉంటూ మళ్లీ ప్రభుత్వం అధికారంలోకొచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమి ంచాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మల్లారం సర్పంచ్ దాసరి సంజయ్కుమార్, నాయకులు ఉపేందర్, ప్రవీణ్, కన్నయ్య, సైదులు, సైదులు, పెద్ది శంకర్ పాల్గొన్నారు.