నల్లగొండ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళా సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలందరి ఆశీస్సులు కేసీఆర్పై ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.