నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35మంది బాధితులకు రూ.20లక్షల సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఆసరగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని గుర్తు చేవారు. రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.