నకిరేకల్, నవంబర్ 10 నకిరేకల్ నియోజకవర్గం నుంచి అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్ మండలం గొల్లగూడెం, నెల్లిబండ, చందంపల్లి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గడపగడపకూ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. అనంతరం నిర్వహించిన రోడ్షోలో ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గానికి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గానికి చేసేందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ 25 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఈ ఎన్నికలు తనకు కొత్తేమీ కాదని, విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తున్నునాని మరోసారి అవకాశమిస్తే నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చేసి తీరుతాన స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో షీప్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, చింతల సోమన్న, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నాయకులు సోమ యాదగిరి, తక్కెళ్లపల్లి ప్రభాకర్రావు, ఎంపీటీసీ బోయిళ్ల కిశోర్, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, యాదయ్య, రాములు పాల్గొన్నారు.
కట్టంగూర్ : అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండంలోని మల్లారం, బొల్లెపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధ్దంగా ఉన్నా కొన్ని విషసర్పాలు కాటేసేందుకు చూస్తున్నాయని వాటితో అప్రమత్తంగా ఉండి తరమికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలే కారణం అన్నారు. మీ అందరి దీవెనలతో మళ్లీ గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నోరెత్తి మాట్లాడినందుకు తుంగతుర్తిలో అద్దంకి దయాకర్కు కోమటిరెడ్డి సోదరులు టికెట్ రాకుండా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదనడానికి అద్దంకి దయాకర్కే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో సంఘవ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వకుండా నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్న చిరుమర్తి లింగయ్యకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు గ్రామశివారులో మహిళలు హారతిచ్చి స్వాగతం పలికి కోలాటం వేస్తు కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, మల్లారం సర్పంచ్ దాసరి సంజయ్కుమార్, ఉప సర్పంచ్ గాదగోని సుజాతామురళి, నాయకులు చింతల సోమన్న, పెద్ది బాలనర్సయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ ఊట్కూరి శంకర్, నాతి ప్రవీణ్, ఎర్ర ఉపేందర్, నాతి శేఖర్, అబ్బగోని సైదులు పాల్గొన్నారు.