యాదగిరిగుట్ట, డిసెంబర్ 29 : అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా సహకరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 10, 6, 4వ వార్డులు, రామాజీపేటలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారులు తెలిపిన నియమాలు పాటించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, కౌన్సిలర్లు సీస విజయలక్ష్మి, ముక్యర్ల మల్లేశ్, బిట్టు సరోజా, ఆవుల మమత, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్గౌడ్, నాయకులు బబ్బూరి శ్రీదర్గౌడ్ పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, ఎంపీడీఓ ప్రభాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని రఘునాథపురంలో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ కాలే సుమలతాఉప్పలయ్య, సర్పంచ్ గాడిపల్లి శ్రవన్కుమార్, ఎంపీటీసీ బుడిగె రేణుకాపెంటయ్యగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని గుండ్లగూడెంలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అనూరాధ, తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, ఎంపీఓ సలీమ్, సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండలంలో పల్లెర్లలో జరిగిన గ్రామసభలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల కోసం తప్పనిసరి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొడితాల నరేందర్గుప్తా, మండల ప్రత్యేకాధికారి రాజారాం, ఎంపీడీఓ నిరంజన్వళి, ఇన్చార్జి తాసీల్దార్ ప్రతాపసింహారెడ్డి, ఆర్ఐ యాదగిరి, ఎంపీఓ పద్మావతి, సీనియర్ అసిస్టెంట్ పాండు, సర్పంచులు నాయిని నరసింహారెడ్డి, వెంకటేశం, ఎంపీటీసీ మల్లారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ నర్సింహ పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండలంలోని రుస్తాపురం, రాంపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు. అదే విధంగా మోతీరాంతండా, చోక్లాతండా, రాంపురం, రుస్తాపురంలో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్, తాసీల్దార్ దేశీయ, ఎంపీడీఓ ఉమాదేవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్నాయక్, గుడిపాటి మధుసూదన్రెడ్డి, రాజయ్య, ఎంపీటీసీ మోహన్బాబు పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండలంలోని ఇక్కుర్తి, ముత్తిరెడ్డిగూడెంలో దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమాల్లో తాసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓ వీరస్వామి పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని మాచన్పల్లి, తిరుమలగిరిలో గ్రామసభలను నిర్వహించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి జ్యోతికుమార్, ఎంపీడీఓ సరిత, ఎంపీఓ శ్రీమాలిని పాల్గొన్నారు.