మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని ఆలగడప గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పరిశ్రామిక పార్కు వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం కలిగించబోమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరావు రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆలగడప, సుబ్బరెడ్డి గూడెం, జాలుబాయితండ, రాయినిపాలెం, అవంతీపురం, చిన్న క్యాంపు రైతులతో సమావేశమై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులను ఆదుకొనే ప్రభుత్వమే తప్ప హాని కలిగించేది కాదన్నారు. రైతుల సంక్షే మం కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులను ఆదుకుంటున్న దన్నారు. పారిశ్రమిక పార్కు ఏర్పాటు ఒక్క ఆలగడప గ్రామంలో కాదని, దామరచర్ల మండలంలో పలు గ్రామాల్లో పరిశ్రమ ఏర్పాటుకు పరిశీలన జరిగిందన్నారు.
ఆలగడపలో 421.35 ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, పరిశ్రమ ఏర్పడితే వారంతా రోడ్డున పడే ప్రమా దం ఉందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిశ్రమ దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు. సెజ్తో నియోజకవర్గంలో ఏ రైతుకు హానీ ఉండబోదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తిప్పన విజయ సింహారెడ్డి, మాజీ మార్కె ట్ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, టీఆర్ఎస్ నాయకులు మట్ట పల్లి సైదులు, పూసపాటి రాజయ్య, గజ్జల కోటిరెడ్డి, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.