మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో రూ.20 లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ వలన మహిళలకు తాగునీటి కష్టాలు తీరిపోయ్యాయని నేడు ఇంటింటికీ తాగు నీరు అందుతుందని అన్నారు. పట్టణంలో అన్ని కాలనీల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ సాదినేని స్రవంతి, నాయకులు వార్డు అధ్యక్షుడు సుంకోజు మురళీచారీ, శ్రీనివాస్గౌడ్, సురేశ్, నరసింహామూర్తి, ధనలక్ష్మి, సాంబాచారి, పిచ్చయ్య రవీందర్ ఉన్నారు.