తిప్పర్తి, జనవరి 22: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు త్వరలో అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు జరిగాయని, ఎవరు అధైర్య పడవద్దని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని దుప్పలపల్లిలో నిర్మించిన ఆరోగ్య ఉప కేం ద్రం భవనం సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పీ డబ్ల్యూ రోడ్డు నుంచి కంకణాలపల్లి వరకు బీటీ రోడ్డ్డు పనులను, రామలింగాలగూడెంలో బ్రిడ్జిని ప్రారంభించారు.
అలాగే కంకణాలగూడెం, రా మలింగాలగూడెం పంచాయతీ భవన నిర్మాణాలకు, జొన్నగడ్డలగూడెంలో గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈసందర్బగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ త్వరలో పూర్తి చేసి ప్రజాపాలన కొనసాగిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేలా చర్యలు చేపడతామన్నారు. జొన్నగడ్డల గూడెంలో రామాలయం నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని, వెంటనే లక్ష రూపాయలను అందజేశారు.
ప్రతి గ్రామంలో గుడి బడి ఉండేలా చూస్తానన్నారు. గతంలో కాం గ్రెస్ ప్రభుత్వం హయంలోనే కాల్వలు తవ్వించడం జరిగిందన్నారు. రైతు బంధు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి ,డీసీసీబీ డైరెక్టర్ పాశంసంపత్రెడ్డి, ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, సర్పంచులు సుశీల, శ్రీదేవి, వెంకట్రాంరెడ్డి, కొన జాన య్య, నాయకులు పాల్గొన్నారు.