‘మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిది నిలకడలేని మనస్తత్వం.. వ్యాపారాలు, కాంట్రాక్టులు ఆయన వ్యాపకం.. అందుకే నియోజకవర్గానికి రాలేక పోతున్నారు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి కూడా తీరిక లేకుండా ఉన్నారు.. అందుకే మంత్రిగా స్వయంగా రంగంలోకి దిగి లబ్ధిదారులకు అందజేసిన’ అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం ముష్టిపల్లికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీ, గట్టుప్పల్ నుంచి పలువురు, మొత్తం 50 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మోసకారి పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే ప్రజలు గులాబీ గూటికి బారులు తీరుతున్నారన్నారు. ఫ్లోరోసిస్ పెంచిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారని తెలిపారు.
నాంపల్లి/మర్రిగూడ జూలై 24 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలకడ లేని మనస్తత్వంతో నియోకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలంలోని ముష్టిపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, పలు గ్రామాలకు చెందిన నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారాలు, కాంట్రాక్టులు రాజగోపాల్రెడ్డి వ్యాపకమని, అందుకే నియోజకవర్గానికి రాలేకపోతున్నారని పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు కూడా పంపిణీ చేసే సమయం ఆయనకు లేదన్నారు. అందుకే మంత్రిగా స్వయంగా తాను రంగంలోకి దిగి పంపిణీ చేసినట్లు తెలిపారు. అబద్ధాలు ఆడడంలో ఆయన నోరు పెద్దదని, ఆయన మాటలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని మోసకారి పార్టీగా ప్రజలు గుర్తించారని అన్నారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. పార్టీలో చేరిన వారిలో ముష్టిపల్లి సర్పంచ్ గుండాల అంజయ్య, ఎంపీటీసీ రమావత్ బుజ్జీచందూలాల్, రాజ్యతండాకు చెందిన నాయకులు రమావత్ బాలు, రమావత్ చందర్, రమావత్ వెంకటి, ముష్టిపల్లికి చెందిన నల్లగంటి కృష్ణయ్య, నల్లగాసు వెంకటయ్య, గాడుదల మారయ్య, నల్లగాసు ఈదయ్య, అందేకార్ చందాజీ, గట్లమల్లేపల్లికి చెందిన నాయకులు మంటిపల్లి యాదయ్య, మంటిపల్లి బలరాం ఉన్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గట్లమల్లేపల్లికి చెందిన దివ్యాంగుడు మల్గిరెడ్డి అత్యుత్రెడ్డికి నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి అందించిన రూ.50 వేల విలువైన రిమోట్ వీల్చైర్ను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. దివ్యాంగుడికి సాయమందించిన ఎంపీపీ శ్వేత, రవీందర్రెడ్డిని మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పాశం సురేందర్రెడ్డి, నారబోయిన స్వరూపారాణీరవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, సర్పంచ్ నాగులవంచ శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, దళితబంధు కమిటీ సభ్యుడు లపంగి నర్సింహ, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, ఏడుదొడ్ల ప్రభాకర్రెడ్డి, పోగుల వెంకట్రెడ్డి, సర్దార్నాయక్, కొన్రెడ్డి ఏడుకొండల్ పాల్గొన్నారు.