సూర్యాపేట పట్టణంలో బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 15, 34వ వార్డుల్లో మూసీ, నాలాపై రూ. 54లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి, కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.అనంతరం వాడవాడలా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి మంగళ హారతులు పట్టి స్వాగతించారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. నల్లా నీళ్లు వస్తున్నాయా, రోడ్లు బాగున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట 2014కు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు. పట్టణాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేలా పనులు చేపడుతున్నామని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 12 : సూర్యాపేట పట్టణాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. పట్టణంలోని 15, 34వార్డుల్లో ప్రజల రాక పోకల సౌకర్యార్థం మూసీ, నాలా కాల్వపై రూ.54లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కల్వర్టు బ్రిడ్జి నిర్మాణాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014కు ముందు ప్రస్తుతం సూర్యాపేటలో ఉన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు. సూర్యాపేటను నందనవనంగా మార్చడమే తన లక్ష్యమన్న పేర్కొన్న ఆయన రెండు బ్రిడ్జిల నిర్మానాలు నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా భావిస్తూ ముందుకు సాగుతున్నదన్నారు. కోట్లాది రూపాయల నిధులతో పట్టణాల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.
కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా ఆయా వార్డుల్లో మహిళలు మంత్రికి మంగళ హారతులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్, మడిపల్లి విక్రమ్, చింతలపాటి భరత్ మహజన్, జ్యోతి కరుణాకర్, రంగినేని లక్ష్మణరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, బీఆర్ఎస్ రాష్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు ఆనంద్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.