మోత్కూరు / అడ్డగూడూరు, డిసెంబర్ 3 : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని, పార్టీలకతీతంగా ప్రజలు సంక్షేమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం ఆయన సమక్షంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అదేవిధంగా అడ్డగూడూరు మండలంలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన 20మంది వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, పట్టణాధ్యక్షుడు కల్యాణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, ఎంపీపీలు కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, దర్శనాల అంజయ్య, జడ్పీటీసీలు శారదాసంతోష్రెడ్డి, శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ అడ్డగూడూరు మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, నాయకులు వెంపల్ల నర్సిరెడ్డి, మద్ది వెంకన్న, మందుల కిరణ్ పాల్గొన్నారు.