బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మోత్కూరు మండలం పనకబండ, రాగిబావి, శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి వివిధ పార్టీల యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
– తిరుమలగిరి/శాలిగౌరారం/కేతేపల్లి, సెప్టెంబర్ 10
శాలిగౌరారం, సెప్టెంబర్ 10 : రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రగతిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తిరుమలగిరిలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్ అధ్వర్యంలో మండలంలోని ఆకారం గ్రామ వివిధ పార్టీలకు చెందిన 15కుటుంబాల వారు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యమ నేత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరు నాగరాజుగౌడ్, అక్కెనపెల్లి లింగయ్య, అయితగోని సత్తయ్య, కుక్కడపు సైదులు, దార అశోక్, విజయ్, లెనిన్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండలంలోని మామిడాల గ్రామ వివిధ పార్టీలకు చెందిన యువకులు బానోతు మహేశ్, యాకూబ్, బొమ్మరబోయిన వెంకన్న, వట్టె శ్రీను, లింగరాజుతో పాటు పలువురు ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో ఆదివారం చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బెడద కర్ణాకర్, దూపటి రవీందర్, యాకూబ్నాయక్, కందుకూరి బాబు పాల్గొన్నారు.
నూతనకల్ : తిరుమలగిరి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నూతనకల్ మండలంలోని మాచనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముల్కలపల్లి నగేశ్, ముల్కలపల్లి సైదులు, మంద గణేశ్, మంద శేఖర్, మంద వంశీ, మంద ముత్తయ్య, కొమ్ము వెంకన్నతో పాటు 30మంది కార్యకర్తలు ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో ఆదివారం చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, గ్రామ సర్పంచ్ కుందెన అమ్మక్క, గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల లింగయ్య, యాకుబ్చారి, గంగరాజు, సైదులు, రవి, మల్సూరు, సురేశ్ పాల్గొన్నారు.
అర్వపల్లి : తిరుమలగిరి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి మండలంలోని బొల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తుంగతుర్తి వీరాచారి, మిద్దె నితిన్, కొమ్ము సతీశ్ ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో ఆదివారం చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గోసుల విజయ్కుమార్, నాయకులు కొనేటి రంగయ్య, వార్డు సభ్యులు కాటబత్తిని లక్ష్మీనర్సు, సండ్ర యాదయ్య, బిక్కినేటి సైదులు, పాల్వాయి శివ, సోమలింగయ్య పాల్గొన్నారు.